Sunday, April 28, 2024

AP: చంద్రబాబు తరుపున నామినేష‌న్ వేసిన ఆయన సతీమణి భువనేశ్వరి

కుప్పం, ఏప్రిల్ 19 (ప్రభ న్యూస్): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం కుప్పం మున్సిపాలిటీ 25వ వార్డులో శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజాలు చేసి భారీ ర్యాలీగా కుప్పం తహసీల్దార్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులకు నామినేషన్ పత్రాలు అందించారు.

ఈ సందర్బంగా చంద్రబాబు ఘన విజయం సాధించాలని కోరుతూ భువనేశ్వరికి చంద్రబాబు నామినేషన్ కు అవసరమైన ఫీజు డబ్బులను మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వికలాంగులు, రైతులు విరాళంగా ఇవ్వడం జరిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement