Thursday, April 25, 2024

ఏపీలో కొత్తగా 643 మందికి కరోనా

ఏపీలో కరోనా మహమ్మారి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 48,028  మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 643 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 839 మంది బాధితులు కోలుకున్నారు. మరో 8 మంది వైరస్ కు బలైయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,55,306కి చేరగా.. 20,32,520 మంది పూర్తిగా కోలుకున్నారు. కోవిడ్ తో మొత్తం 14,236 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8550 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా కేసులు

అనంతపురం 23, చిత్తూరు 145, తూర్పుగోదావరి 84,గుంటూరు81, వైఎస్ఆర్ కడప15, కృష్ణాలో 74, నెల్లూరు 69, ప్రకాశం 60, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 46, విజయనగరం 8, పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేసులు నమోదు అయ్యాయి. అత్యల్పంగా కర్నూలులో మూడు కేసులు వెల్లడి అయ్యాయి. ఇక, కోవిడ్ తో ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

ఇది కూడా చదవండి: ‘మా’ కోసం మనమందరం: మంచు విష్ణు మ్యానిఫెస్టో విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement