Saturday, April 27, 2024

ఏపీలో తగ్గని కరోనా కేసులు.. తాజాగా 1,520 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 64,739 మంది సాంపిల్స్ ని పరీక్షించడగా.. 1,520 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. మహమ్మారికి పది బలైపోయారు. అదే సమయంలో మొత్తం 1,290 మంది కోవిడ్నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,18,200కి చేరగా.. ఇందులో 19,89,391 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,922 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 13,887 మంది మరణించారు. కాగా, నేటి వరకు రాష్ట్రంలో 2,68,09,774 సాంపిల్స్ ని పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement