Thursday, April 25, 2024

‘మా’ ఎన్నికల్లో తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన ప్రకాష్ రాజ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే తన కార్యవర్గాన్ని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఆయన ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో ఉపాధ్యక్షులుగా బెనర్జీ, హేమ పోటీ చేస్తారని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ట్రెజరర్ గా నాగినీడు, సంయుక్త కార్యదర్శులుగా అనితా చౌదరి, ఉత్తేజ్ పోటీ చేయనున్నట్టు తెలిపారు.

సీనియర్ నటి జయసుధ అమెరికా వెళ్లడం వల్ల ఆమెకు ప్యానెల్లో చోటు కల్పించలేదని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. అయితే ప్యానెల్‌కు తన మద్దతు ఉంటుందని జయసుధ హామీ ఇచ్చారని వివరించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ప్రగతి, అనసూయ, అజయ్, సుబ్బరాజు, సమీర్, ఖయ్యూం, బ్రహ్మాజీ, కౌశిక్, ప్రభాకర్, భూపాల్, శివారెడ్డి, రమణారెడ్డి, సుడిగాలి సుధీర్, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్ సభ్యులుగా ఉన్నారు.

ఈ వార్త కూడా చదవండి: ‘సల్లాటి కుండలో సల్లసక్క మనసువాడు’ అంటున్న టక్ జగదీష్

Advertisement

తాజా వార్తలు

Advertisement