Sunday, May 5, 2024

Andhra Pradesh – ఉద్యోగులు బాగుంటేనే ప్ర‌జ‌లూ బాగుంటారు …జ‌గ‌న్

తాడేప‌ల్లి – ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తాం. ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములు. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనది. మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే మా ఉద్దేశం అని సీఎం పేర్కొన్నారు.తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శుక్రవారం కలిశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జీపీఎస్‌ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్‌ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్, ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఈ సంద‌ర్భంగా ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో సిఎం మాట్లాడుతూ, ”అందుకే పెన్షన్సహా కొన్ని పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపనపడ్డాం. గతంలో ఎవ్వరూ కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపించడానికి తపనపడ్డ సందర్భాలు లేవు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి, అంతేకాకుండా భావితరాలను కూడా దష్టిలో ఉంచుకోవాలి. దీన్ని దష్టిలో ఉంచుకుని జీపీఎస్ను తీసుకువచ్చాం. రిటైర్డ్‌ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్‌ను రూపొందించాం. 62 ఏళ్లకు రిటైర్‌ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలి. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచాం” అని చెప్పారు. ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement