Thursday, May 2, 2024

ఏపీలో కొత్తగా 13, 400 కొత్త కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన ఐదు రోజులుగా కేసులు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 84,232 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 13,400 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా మహమ్మారికి 94 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 21,133 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1685142 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 1,65,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 10,832 మంది మరణించారు.

గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం, పశ్చిమగోదావరిలో 9, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. కృష్ణ, విజయనగరం జిల్లాల్లో 6, కర్నూలు, నెల్లూరు జిల్లాలో 5, గుంటూరు, కడప జిల్లాల్లో నలుగురు చొప్పున మరణించారు.

ఇక, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2598 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం 1215, చిత్తూరు 1971, గుంటూరు 848, విశాఖపట్నం 1054, పశ్చిమగోదావరి జిల్లా 968, శ్రీకాకుళం 623, నెల్లూరు 652, కర్నూల్ లో 712, ప్రకాశం 838, విజయనగరం 362, కడప 701, కృష్ణలో 858 కరోనా పాటిజివ్ కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement