Thursday, May 16, 2024

Andhra Prabha – జగన్ కోసం సిద్ధం షురూ! – పేదలే పార్టీ స్టార్ క్యాంపెయినర్లు – సజ్జల

ఆంధ్రప్రభ , అమరావతి : ఏపీలో 175 నియోజకవర్గాల్లో 47 వేల బూత్ కమిటీల నిర్మాణం పూర్తి చేశామని, ఒక్కో బూత్ కమిటీలో‌ పది మంది సభ్యులుంటారని, వీరందరితో ఇంటింట ప్రచారంకార్యక్రమం చేపట్టాం, జగనన్న కోసం సిద్ధం పేరుతో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి అన్నారు.

తాడేపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాల క్యాలెండర్, మేనిఫెస్టో కలిసి ఉండేలా ఒక రికార్డు తయారు చేశామని, వచ్చే అయిదేళ్లల్లో తమ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలిపే రీతిలో నిత్యం కనపడేలా ఏర్పాటు చేశామని సజ్జల అన్నారు. ప్రభుత్వ లబ్దిదారులే తమకు స్టార్ క్యాంపెయినర్లని సినిమా వాళ్లో మరొకరో స్టార్ క్యాంపెయినర్లు ఉండరని అన్నారు. పేద వర్గాలకు చెందిన 12 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేశామని, జగన్ కే ఎందుకు ఓటు వేయాలో వాళ్లు తెలియచేస్తారని, జగన్ కోసం సిద్దం పేరిట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement