Friday, May 3, 2024

రెండు వాహ‌నాలు ఢీ – త‌ప్పిన ముప్పు..

వాల్మీకిపురం ప్రభ న్యూస్ : అనంతపురం- తిరుపతి జాతీయ రహదారి లోని వాల్మీకిపురం మండలం టీ ఎం లోయ దగ్గర ఎదురెదురుగా వస్తున్నా రెండు వాహనాలు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. పచ్చి మిరపకాయల లోడుతో టెంపో వాహనం మదనపల్లె నుంచితిరుపతికి బయలుదేరింది. మార్గమధ్యంలో టీ ఎం లోయ దగ్గర ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఒకదానినొకటి తప్పించబోయి ఎదురు ఎదురు దిక్కుల్లో దూసుకుపోయాయి. ఈ ప్రమాదంలో టెంపో సైతం నుజ్జునుజ్జు అయిపోయింది. అలాగే టెంపుల్ లోని మిరపకాయల దిగుబడి మొత్తం నేల పాలు అయిపోయింది. టెంపో బస్సులో ఉన్న నలుగురు వ్యక్తుల‌కి స్వల్ప గాయాలు అయ్యాయి. వాహనాలు రోడ్డుపై బ్లాక్ కావడంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక పోలీసు స్టేషన్లో సైతం ఎస్.ఐ తో పాటు ఉన్న పోలీసులు విధులు పై ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాదాపు రెండు గంటలపాటు రోడ్డుపైనే వాహనాలతో పాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement