Sunday, May 5, 2024

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ప‌ట్టివేత


ప్ర‌కాశం జిల్లా హనుమంతునిపాడు మండల పరిధిలోని హాజీపురం క్రాస్ రోడ్డు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగిందని స్థానిక ఎస్ఐ క్రిష్ణ పావని తెలిపారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ… మార్కాపురం నుండి 587 బస్తాల రేషన్ బియ్యంతో వస్తున్న లారీని పట్టుకొని సీజ్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement