Wednesday, May 1, 2024

యల్లనూరు పూల అంగడిలో చోరీ

యల్లనూరు : స్థానిక మండల కేంద్రంలో శ‌నివారం అర్ధరాత్రి అత్తార్ మసూద్ వలి పూల అంగడిలో చోరి జరిగింది. పూల అంగడి బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ప్రతి రోజు పూల వ్యాపారంలో వచ్చిన సొమ్మును అంగడిలో పెట్టి తాళం వేసుకునేవాన్ని, దినచర్యలో శనివారం కూడా అలాగే వచ్చిన సొమ్మును లోపల పెట్టి వెళ్లానని ఆదివారం ఉదయం అంగడి వద్దకు వచ్చే సరికి
తాళం తీసి ఉండడం చూసాను. అంగడి లోపలికి వెళ్లి చూడగా డబ్బులు పెట్టిన పెట్టెలో డబ్బులు లేవన్నాడు. దాదాపు రెండు నెలల నుండి పోగు చేసిన సొమ్ము సుమారు రూ.2.46 లక్షలు గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు తెలిపాడు. విషయం పై పోలీసులకు సమాచారం అందించడం జరిగిందని బాధితుడు తెలిపాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement