Saturday, May 11, 2024

రాఘవుడి సేవలో నారా లోకేష్

మంత్రాలయం, ఏప్రిల్ 27, (ప్రభన్యూస్): ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థము టిడిపి జాతీయ నాయకులు నారా లోకేష్ గురువారం మంత్రాలయానికి వచ్చారు.నారా లోకేష్ కి మఠం అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను, శ్రీ రాఘ వేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని విశేష పూజలు చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు మెమొంటో శేష వస్త్రం ఫలా పుష్ప మంత్రాక్షికలు పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి,మాజీ మంత్రి అఖిల ప్రియ, తిక్కా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దివాకర్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, పన్నాగ వెంకటేశప్ప స్వామి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి, అమర్నాథ్ రెడ్డి,మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాసరావు, ఐపి నరసింహమూర్తి, వ్యాస్ రాజ్ ఆచార్, బిందు స్వామి సిఐ శ్రీనివాసులు ఎస్సై వేణుగోపాల్ రాజు,ఎస్ ఐ కిరణ్,మరియు పోలీస్ సిబ్బందితదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement