Friday, May 3, 2024

AP:ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

శ్రీ సత్యసాయి బ్యూరో, డిసెంబర్ 26 (ప్రభన్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం జగన్మోహన్ రెడ్డి లాంచనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా కు సంబంధించి కదిరి నియోజకవర్గంలో తలుపుల మండల కేంద్రం డిప్పుల చేను గ్రౌండ్ నందు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి ప్రారంభించారు. మొదట ఎమ్మెల్యే జండా వందనం గావించి అనంతరం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయి లో వివిధ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంపిక చేసి వారిని మండల స్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి వరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్రికెట్, కోకో, వాలీబాల్, కబ్బడ్డి & బ్యాట్ మిటన్ ఆటలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఈ ఆటలో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని చూపిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఆటలు నేటి నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు సచివాలయ స్థాయిలో నిర్వహించడం జరుగుతున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, పట్టణ అధ్యక్షులు, మండల కన్వీనర్లు, జె సి ఎస్ ఇన్చార్జులు, వివిధ శాఖల చైర్మన్ లు, డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సోషియల్ మీడియా సోదరులు, పోలింగ్ బూత్ మేనేజర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కన్వీనర్లు, సంబంధిత అధికారులు మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement