Sunday, April 28, 2024

లారీ, టిప్ప‌ర్ ఢీ : ఒక‌రు మృతి

లారీ, టిప్ప‌ర్ ఢీకొన్న ప్ర‌మాదంలో ఒక‌రు మృతిచెందిన విషాధ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా…. అనంతపురం జిల్లా గుత్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం టి.కొత్తపల్లి గ్రామం వద్ద ఉన్న బస్టాప్ వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ, టిప్పర్ ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. అయితే ఈ ప్ర‌మాదంలో మరికొంత మందికి గాయాల‌య్యాయి. గాయాల‌పాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement