Wednesday, May 1, 2024

ఫుడ్ పాయిజ‌న్.. 40మంది విద్యార్థినీల‌కు అస్వ‌స్థ‌త‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. శింగనమల కస్తూరిబా గురుకుల స్కూల్ లో సుమారు 40 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది బాధిత విద్యార్థినీలను ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి ఉషశ్రీ చరణ్ బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement