Saturday, April 20, 2024

అన్ స్టాప‌బుల్ షోలో నెపోటిజంపై.. ఫైర్ అయ్యారు నిర్మాత అల్లు అర‌వింద్

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ అన్ స్టాపబుల్ షోలో నెపోటిజంపై ఫైర్ అయ్యారు.ఈ షోలో నెపోటిజం టాపిక్ రావడంతో అల్లు అరవింద్ ఫైర్ అయ్యారు. నెపోటిజంపై మీ అభిప్రాయాలు చెప్పండి అని బాలయ్య ప్రశ్నించడంతో వెంటనే రియాక్ట్ అయిన అల్లు అరవింద్.. నెపోటిజం అంటూ విమర్శలు గుప్పిస్తున్న వారు గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలి.. ఒకవేళ వారికే ఇలాంటి అవకాశం వస్తే వదులుకుంటారా? అంటూనే లేదు కదా తెలిపారు.

చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో అదే వృత్తిపై ఇంట్రెస్ట్ ఉండడం కామన్. అలాగే టాలెంట్ ఉన్నప్పుడు పేరెంట్స్ చూసిన మార్గం ఎంచుకోవడంలో తప్పేమీ లేదు కదా.అయినా ఒక సినీ ఇండస్ట్రీ నే కాదు డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్ మాన్ , లాయర్ ఇలా అన్ని వృత్తుల్లో ఉన్నవారు కూడా తమ పిల్లలను అదే వృత్తిలో సెట్ చేయడం లేదా.. మరి అది నెపోటిసం అనపడదా అంటూ అల్లు అరవింద్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.. ఇదే విషయంపై సురేష్ బాబు కూడా స్పందిస్తూ నెపోటిజం అనేది కేవలం ఆరంభం మాత్రమే.. స్టార్ గా ఎదగాలంటే టాలెంట్ ఉండాల్సిందే. వారసత్వం వల్లే స్టార్ అవుతారు అనడం తప్ప‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement