Friday, April 26, 2024

పేద బాలిక చ‌దువు కో్సం మేయ‌ర్ వ‌సీం ఆర్థిక స‌హాయం..

అనంతపురం : అనంతపురం లోని రుద్రంపేట కు చెందిన పేదింటి బాలిక విద్య కోసం అనంతపురం మేయర్ వసీం ఆర్ధిక సహాయం అంద‌జేశారు.. త‌ల్లితో క‌ల‌సి ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆ బాలిక త‌న పేద‌రికం గురించి వివ‌రించింది.. దీంతో న‌గ‌దు సాయంతో పాటు ఆ బాలిక‌కు అవ‌స‌ర‌మైన పుస్త‌కాల‌ను కొని ఇచ్చారు..

మాజీ మేయర్ తో మ‌ర్యాద‌పూర్వ‌క భేటి
నగరపాలక సంస్థ మేయర్ వసిం శనివారం నాడు మాజీ మేయర్ రాగే పరశురామ్ గృహానికి వెళ్లి పలకరించారు ఇటీవల నగరపాలక సంస్థ మేయర్ గా పదవి స్వీకరించిన మొదట పాతూర్ లోని మాజీ మేయర్ పరశురాం ఇంటికి వెళ్లి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.. ఈ సంద‌ర్భంగా వసీంను ప‌రుశురామ్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement