Saturday, May 4, 2024

Breaking: బైకును ఢీకొట్టిన‌ ఆటో, ఒక‌రు మృతి.. కృష్ణా జిల్లాలో ఘ‌ట‌న‌

ఏపీలోని కృష్ణా జిల్లాలో ఇవ్వాల (మంగ‌ళ‌వారం) రాత్రి బైక్ యాక్సిడెంట్ జ‌రిగింది. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం పెట్రోల్ బంక్ వద్ద కొద్ది సేప‌టి క్రిత‌మే బైకుని ఆటో ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. కాగా, ఘ‌ట‌నా స్థ‌లంలోనే బైకుపై వెళ్తున్న వ్య‌క్తి చ‌నిపోయాడు. మృతుడిని వేక‌నూరు గ్రామానికి చెందిన మాదివాడ రామాంజ‌నేయులుగా పోలీసులు గుర్తించారు. ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదం తీరును ప‌రిశీలిస్తున్నారు. ఈ యాక్సిడెంట్‌కి సంబంధించి మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement