Thursday, April 25, 2024

Amaravati Padayatra: అలుపెరుగని ఉద్యమం.. అడుగడుగునా జన నీరాజనం

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాంటూ ఆ ప్రాంత రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట చేపట్టిన మహాపాదయాత్ర 27వ రోజుకు చేరింది. రాజధాని రైతుల పాదయాత్ర నేడు నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఈ రోజు నెల్లూరు జిల్లాలో 12 కిలోమీటర్ల మేర కొనసాగనున్న రైతుల పాదయాత్ర.. అంబాపురం వద్ద ముగియనుంది.

ఏపీలో భారీ వర్షాలు కురుస్తునప్పటికీ రాజధాని రైతులు పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాజధాని రైతుల పాదయాత్రకు ఊరురా రైతులు, ప్రజలు నీరాజనం పడుతున్నారు. కాగా, నవంబర్ 1న ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. డిసెంబర్‌ 15న తిరుమలకు చేరుకోనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement