Monday, May 6, 2024

రోడ్డు ప్రమాదంలో ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి మృతి

కర్నూలు జిల్లా – ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బీచుపల్లి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కర్నూల్ కి వస్తున్న ఆమె ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం టైర్ పేలి ప్రమాదానికి గురైంది. దీంతో కారు పక్కకి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కాగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను కర్నూల్ లోని శ్రీ చక్ర ఆసుపత్రికి హుటా హుటిన తరలించారు. ఆసుపత్రి చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement