Monday, April 29, 2024

పాస్టర్లందరికీ గౌరవ వేతనం అందించాలి.. సజ్జలకు ఏపీ బిషప్స్‌ కౌన్సిల్‌ విజ్ఞప్తి

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పాస్టర్లందరికీ గౌరవ వేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ బిషప్స్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రధాన కార్యాలయంలో మంత్రి మేరుగ నాగార్జునతో కలిసి నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్‌ బిషప్స్‌ కౌన్సిల్‌ నూతన కార్యవర్గం చైర్మన్‌ ఎలమంచిలి ప్రవీణ్‌ ఆధ్వర్యంలో నేతలు కలిశారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డిని శాలువాతో సత్కరించి రాష్ట్రంలోని -కై-స్తవుల సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. చర్చిల నిర్మాణానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని కోరారు. సజ్జల స్పందిస్తూ ప్రభుత్వం ఈ రెండు అంశాల పట్ల సానుకూలంగా ఉందని, త్వరలోనే ఈ రెండు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement