Sunday, April 28, 2024

హృదయ విదారక ఘటన: భార్య ఒడిలోనే భర్త మృతి

దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. అత్యవసర సమయంలో మెడికల్ ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ క్రమంలో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా త్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్‌లో   హృదయ విదారక ఘ‌ట‌న చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారంపై భార్య ఓడిలోనే భర్త ప్రాణాలు వదిలాడు.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం మిద్దూరుకు చెందిన చంద్రశేఖర్ (60), అతని భార్య బెంగళూరుకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరూ కరోనా బారినపడడంతో 15 రోజుల క్రితం కుప్పం ఆస్పత్రిలో చేరారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక బెంగళూరు వెళ్లేందుకు దంపతులిద్దరూ కుప్పం రైల్వే స్టేషన్‌ కు వెళ్లారు. అనూహ్యంగా అస్వస్థతకు గురైన చంద్రశేఖర్ ప్లాట్‌ ఫారంపై భార్య ఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. భర్తను కోల్పోవడంతో అక్కడే గుండెలు పగిలేలా విలపిస్తున్న మహిళను చూసినవారు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement