Wednesday, May 22, 2024

పీఈసెట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్ విడుద‌ల‌..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీఈసెట్‌- 2021లో అర్హత సాధించిన అభ్యర్థులకు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పీఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 27, 28 తేదీల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కన్వీనర్‌ సూచించారు. ఈ నెల 29, 30 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలన్నారు.

రెండో తేదీన వెబ్‌ ఆప్షన్స్‌ సవరణకు అవకాశం కల్పిస్తామన్నారు. ఫిబ్రవరి నాలుగో తేదీన సాయంత్రం ఆరు గంటల తర్వాత సీట్ల అలాట్‌మెంట్‌ జరుగుతుందన్నారు. ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీలోగా సీట్లు కేటాయించిన అభ్యర్థులు కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు, నోటిఫికేషన్‌ కోసం ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ సందర్శించవచ్చని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement