Wednesday, May 1, 2024

ధార్మిక పరిషత్ కుదింపు పై హైకోర్టులో విచారణ

అమరావతి : ధార్మిక పరిషత్తును కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్, చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 21 మంది సభ్యులున్న ధార్మిక పరిషత్‌ను నలుగురికి పరిమితం చేసి అధికారులు నియమించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు.
ఉమేష్ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ఈ వ్యవహారానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంపై స్టే ఇవ్వాలని న్యాయవాది ఉమేష్ చంద్ర కోరగా…  ప్రభుత్వం కౌంటర్ వేసిన తర్వాత ఈ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం చెప్పింది. కేసు తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement