Friday, April 26, 2024

నెల్లూరు సైబర్​ క్రైమ్​లో ఆదిలాబాద్​ యువకుడి హస్తం.. కోటి రూపాయల లావాదేవీలపై విచారణ

తెలంగాణలోని ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ మండలానికి చెందిన ఓ యువకుడికి ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో జరిగిన సైబర్​ క్రైమ్​తో సంబంధం ఉన్నట్టు వెల్లడయ్యింది. ఈ మేరకు ఇవ్వాల (మంగళవారం) నెల్లూరు సిటీ ఆరో టౌన్​ పోలీసులు నేరడిగొండ బుగ్గారం బి గ్రామానికి వచ్చి ఆ యువకుడిని తీసుకెళ్లారు. దీనికి సంబంధించి లోకల్​ పోలీసు స్టేషన్​లో సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే.. నెల్లూరులో కోటి రూపాయల గోల్​మాల్​ విషయంలో ఈ యువకుడి హస్తం ఉన్నట్టు పోలీసుల ద్వారా తెలిసింది. ఈ యువకుడి బ్యాంక్​ అకౌంట్​లో కోటి రూపాయల నగదు జమ అయినట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యిందని నెల్లూరు జిల్లా ఆరో పట్టణ పోలీస్​స్టేషన్​ సీఐ తెలిపారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరగడంతో విచారణ జరపనున్నట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement