Sunday, May 5, 2024

KNL: మద్యానికి బానిసై… వ్యక్తి ఆత్మహత్య

కర్నూలు:మద్యానికి బానిసై.. ఇంటి వారు మందలించడంతో మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూల్ నగరంలో ఇవాళ వెలుగు చూసింది. స్థానిక గణేష్ నగర్ కు చెందిన కే.ప్రవీణ్ (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు భార్య లక్ష్మీదేవితో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

మద్యానికి అలవాటుపడి కుటుంబాన్ని పట్టించుకోకుండా .. తరచూ భార్యపై అనుమానంతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement