Saturday, May 4, 2024

Yash: అప్పన్న విగ్రహాన్ని దర్శించుకున్న కేజీఎఫ్‌ హిరో

విశాఖ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన అప్పన్న విగ్రహాన్ని ప్రముఖ హీరో యాష్‌ దర్శించుకున్నారు. కేజీఎఫ్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా వైజాగ్ వచ్చిన యాష్ ఎయిర్ పోర్ట్ లో అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో సూర్యకళ, ట్రస్టు బోర్డు సభ్యులు స్వామి క్షేత్రమహిత్యాన్ని తెలియజేశారు. ఆయా కార్యాక్రమంలో స్ధానాచారులు టీపీ రాజ్‌గోపాల్‌, పురోహితులు కరి సీతారామాచార్యులు, ఏఈవో రమణమూర్తి, విగ్రహశిల్పి రమణ, ఆలయ ఈఈ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement