Thursday, May 23, 2024

AP | తిరుమల ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం జరిగింది. రెండు రోజుల క్రితం ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మరిచిపోకముందే ఈరోజు ఘాట్ రోడ్డులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండో ఘాట్ రోడ్డులోని వినాయక దేవాలయం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొంది. తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఎలాంటా ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటన అనంతరం భక్తులను మరో వాహనంలో అక్కడి నుంచి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement