Friday, May 17, 2024

తిరుపతిలో ఏసీబీ అధికారుల సోదాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ డీఈ రుద్రరాజు రవి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు సోదాలు చేపట్టారు.ఈ క్రమంలో తిరుపతిలో మొత్తం ఐదు ప్రాంతాలతో పాటు చిత్తూరులోని రెండు చోట్ల ఏసీబీ సిబ్బంది తనిఖీలు చేస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రుద్రరాజు రవి అవినీతికి పాల్పడటంతో పాటు పలు కాంట్రాక్ట్ లకు గానూ అధిక మొత్తంలో లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement