Wednesday, May 1, 2024

ఆర్టీసీ బస్సు ఢీకొని.. ఇద్దరి దుర్మరణం

భూపాలపల్లి (ప్రభ న్యూస్) : జయశంకర్ జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేట్ క్రాస్ రోడ్డు దగ్గర పరకాల -భూపాలపల్లి ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడిక‌క్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం గణపురం మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన నరాల బక్కయ్య తన మనవరాలును భాగిర్తిపేట గ్రామంలో వారి ఇంటి వద్ద దింపేందుకు సీతారాంపురం నుండి భాగిర్తిపేటకు ద్విచక్రవాహనం పై బయలుదేరాడు. బాగిర్తిపేట మూలమలుపు వద్ద పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండకు వెళుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement