Monday, April 29, 2024

సర్వేయర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ..

విశాఖలోని పద్మనాభ మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ.11 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బ్రాందేయపురంలో 4 ఎకరాల భూమి సర్వేకు ఉపేంద్ర 18వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం వ్యవహారంలో మరో ఇద్దరు సర్వేయర్లు సహకరించారు. సర్వేయర్ ఉపేంద్ర, బ్రాందేయపురం, మిద్దె సచివాలయ సర్వేయర్లు ఏసీబీ అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: శ్రీదేవి సోడా సెంటర్ పై డైరెక్టర్ ఎమోషనల్ లెటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement