Tuesday, April 30, 2024

Srisailamలో మూడు రోజుల పాటు ఆర్జిత అభిషేకాలు నిలిపివేత‌

శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు అభిషేకాలకు ఆర్జిత అభిషేకాలు నిలిపివేసింది. రేపు వైకుంఠ ఏకాదశి, ఎల్లుండి వారాంతపు సెలవులు కావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 23, 24, 25 తేదీల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.

భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తుగా గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు.. అభిషేకాలకు ప్రత్యామ్నాయంగా రోజుకు నాలుగు విడతల్లో మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి రేపటి నుంచి మూడురోజుపాటు నాలుగు విడతలుగా అనుమతించనున్నట్లు చెప్పారు. టికెట్లను దేవస్థానం వైబ్​సైట్​ ద్వారా నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement