Saturday, May 18, 2024

AP: కర్నూలు జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కర్నూలు పర్యటనకు వచ్చారు. జిల్లాలోని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి 352వ ఆరాధనోత్సవాల్లో పాల్గొనేందుకు ఇవాళ మధ్యాహ్నం కర్నూలు పోలీసు అతిథి గృహానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేరుకున్నారు.

ఈసందర్భంగా గవర్నర్ కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన వారిలో జిల్లా ఇంఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఐజి సెంథిల్ కుమార్, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ, నగర మేయర్ బివై.రామయ్య, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement