Tuesday, April 30, 2024

Big Breaking | ప్ర‌కాశం జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. కాలువలో పడిన బస్సు, ఏడుగురు మృతి

ఒంగోలు (ప్ర‌భ‌న్యూస్‌) : ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు కాలువలో పడి ఏడుగురు మృతి చెందిన ఘటన ఇవ్వాల (మంగళవారం) తెల్లవారుజామున జరిగింది. పొదిలి నుండి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సు దర్శి సమీపంలోని ఎన్ఎస్పీ కాలువలో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 47 మందిలో ఏడుగురు అక్కడికక్కడే చ‌నిపోయారు.

మృతి చెందిన వారిలో అబ్దుల్ హజిజ్స్ (65), అబ్దుల్ హాని (60), Sk. రామేజ్ (40), ముల్లా జానీ (65), షాక్ సాబీనా (35, )మూల్లా నర్సాహన్ (58), షైక్. హీనా (6)గా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ తోపాటు ఆర్టీసీ అధికారులు సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement