Thursday, May 2, 2024

AP | ఆత్మహత్యాయత్నానికి యత్నించిన వ్యక్తి.. ప్రాణం పోసిన ప్రభుత్వ వైద్యులు

విజయవాడ, (ప్రభ న్యూస్): ఒకవైపు ఒంట్లో తగ్గని జబ్బు, మరోవైపు వయసు పై పడటం, ఆదరణ లేక,నిరాశ, నైరాశ్యం తో జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్న వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైద్యం చేసి అతనికి ప్రాణం పోశారు . ఎన్టీఆర్ జిల్లా విజయవాడ టూ టౌన్ ప్రాంతానికి చెందిన సిహెచ్ కృష్ణ(59 )జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. “నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్” టెలిమనాస్ కౌన్సెలింగ్ సెంటర్‌కు రెస్క్యూ టీం నుంచి ఫోన్ వచ్చింది. డాక్టర్లు అతని శారీరిక, మానసిక ఆరోగ్య పరిస్థితిని గమనించి పెరినియల్ అబ్సెస్ ,హేమోరాయిడ్స్‌తో బాధపడుతున్నాడని గుర్తించారు.


విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలసూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ ప్రొఫెసర్ డా.కె.అప్పారావు ,అసోసియేట్స్ ప్రొఫెసర్ డా.సేతు మాధవి తదితరులు అతనికి చికిత్స అందించి ప్రాణం మీద ఆశ కలిగేలా ప్రోత్సహించారు. చికిత్స నుండి బుధవారం ఆ వ్యక్తి పరిపూర్ణంగా కోరుకున్నాడు. సైకియాట్రిస్ట్ – డాక్టర్ బి లక్ష్మి ,డా.యు.శోబా తదితరులు కౌన్సిలింగ్ ఇచ్చి అతనిని వి .ఎం. సి వృద్ధాశ్రమంలో చేర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement