Monday, April 29, 2024

AP | జింక ఢీకొట్టడంతో యాక్సిడెంట్​.. బైక్​పై వెళుతున్న వ్యక్తి మృతి

పత్తికొండ , (ప్రభ న్యూస్) : క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ మండలంలో దారుణం జ‌రిగింది. కనకదిన్నె సమీపన బైకు పై వెళుతున్న వ్య‌క్తిని ఓ జింక ఢీకొట్టింది. దీంతో తెర్నేకల్ హుసేన్ షా (50 ) అనే వ్య‌క్తి బైకుపై నుంచి అదుపుతప్పి అక్కడికక్కడే చ‌నిపోయాడు. హుస్సేన్ షా కార్పెంటర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ప‌నిమీద‌ దేవనకొండ మండలం కొల్లాపురం గ్రామానికి వెళ్తున్నాడు.

కనకదిన్నె సమీపంలో చేనులో నుంచి ఓ జింక అతివేగంగా త‌న బైకును ఢీకొట్టింది. దీంతో బైకు అదుపుతప్పి కింద‌ప‌డిపోయింది. ఈ క్ర‌మంలో హుస్సేన్ అక్కడికక్కడే చ‌నిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విష‌యం తెలుసుకున్న కనకదిన్నె గ్రామ‌స్తులు అక్కడికి చేరుకొని గాయాలు తగిలిన వ్యక్తిని అంబులెన్స్ ద్వారా పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement