Sunday, April 28, 2024

Flash.. Flash: కానిస్టేబుల్ దారుణ హత్య.. దారికాచి నరికి చంపిన దుండ‌గులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నంద్యాల జిల్లా కేంద్రం.. పట్టణ శివారులో ఓ కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు, ఆదివారం రాత్రి అత‌ను ఇంటికెళ్లే స‌మ‌యంలో దారికాచి మ‌రీ దారుణుంగా క‌త్తుల‌తో న‌రికి చంపిన‌ట్టు తెలుస్తోంది. కాగా మృతుడిపేరు సురేంద్రగా తెలుస్తోంది. నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సమీపంలో సుమారు రాత్రి 10.30 గంటల సమయంలో కానిస్టేబుల్ సురేంద్ర ను కొందరు దుండగులు అటకాయించి ఆటోలో కిడ్నాప్ చేశారు. అక్కడ నుంచి పట్టణ శివారులోని చెరువుకట్ట ప్రాంతానికి తీసుకొని వెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు.

ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన హత్య ఉదాంతంతో పోలీస్ శాఖ ఉల్లిక్కిపాటుకు గురైంది. విషయం తెలిసిన వెంటనే పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే.. కానిస్టేబుల్ సురేంద్ర హత్యకు గ‌ల‌ కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement