Monday, April 29, 2024

AP | డ్రంకెన్​ డ్రైవ్​లో పట్టుబడ్డ యువకులు.. 20 మందిపై కేసు నమోదు

ముత్తుకూరు (ప్రభ న్యూస్): నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండ‌లంలో పోలీసులు ఇవ్వాల (ఆదివారం) రాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వ‌హించారు. అదేవిధంగా ప‌బ్లిక్ ప్లేస్‌లో మ‌ద్యం తాగేవారిపైనా యాక్ష‌న్ తీసుకున్నారు. మండల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి మద్యం తాగి వాహనాలు నడపడం, పబ్లిక్ స్థలాల్లో మద్యం సేవిస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్టు ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. వీరిలో డ్రంకెన్‌ డ్రైవ్ చేస్తున్నఆరుగురు, పబ్లిక్ స్థలాల్లో మద్యం సేవించిన వారిలో 14 మంది ఉన్న‌ట్టు తెలిపారు. వారిని స్టేషన్ కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. వీరిపై కేసు నమోదు చేసిన‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement