Sunday, April 28, 2024

Big Breaking | పల్నాడులో కారు బీభత్సం.. దుకాణంలోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి

ఏపీలోని పల్నాడులో ఘోరం జరిగింది. ఇవ్వాల (ఆదివారం) రాత్రి కొద్దిసేపటి క్రితం అచ్చంపేట మండలం కొత్తపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దుకాణంలో పనిచేస్తున్న నాగేశ్వరరావు (55) చనిపోయాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కాగా, కారులో మద్యం బాటిళ్లున్నట్టు స్థానికులు చెబుతున్నారు.  దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement