Thursday, May 2, 2024

Mantralayam: వైసీపీ, టీడీపీల మధ్య రూ.2 కోట్ల పందెం రగడ

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గెలుస్తాడని వైసీపీ నేతలు.. టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని ఆ పార్టీ నేతలు రూ.2 కోట్ల పందెంకు బహిరంగంగా సవాల్ విసురుకున్న సంగతి విధితమే. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆదోని పరిధిలోని ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలో రూ.2 కోట్లు డిపాజిట్ చేయడానికి వెళ్తున్నట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆంక్షలు విధించారు. వీటిపై వైసీపీ నేత, మాజీ ఎంపీపీ రఘురాం, టిడిపి నేత మల్లికార్జునకు నోటీసులు ఇచ్చి కానిస్టేబుళ్లను ఇరువురి వద్ద పెట్టినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement