Monday, April 29, 2024

ఆంధ్రప్రదేశ్​లో 69 కరోనా కేసులు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 69 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 12,820 శాంపిల్స్‌ను పరిశీలించగా 69 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఎలాంటి మరణాలు సంభవించలేదు. 82 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అనంతపురంలో 26, చిత్తూరులో 7, ఈస్ట్‌ గోదావరిలో 8, గుంటూరు 3, వైఎస్‌ఆర్‌ కడప 1, కృష్ణా 2, కర్నూలు 2, ప్రకాశం2, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 9, వెస్ట్‌ గోదావరిలో 8 చొప్పున కేసులు నమోదయ్యాయి. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 కోట్ల 32 లక్షల 91 వేల 315 శాంపిల్స్‌ను పరిశీలించగా 23 లక్షల 19 వేల 012 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 23 లక్షల 03 వేల 772 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం 510 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement