Friday, April 26, 2024

స్టీల్‌ ప్లాంటు ప్రైవేటు పరం కానివ్వం:స్వరూపానందేంద్ర

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మ నందేంద్ర స్వామి కూడా కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని వారు అన్నారు. తెలుగువారంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారని స్వరూపానందేంద్ర చెప్పారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేట్ పరంకానివ్వబోమని తేల్చి చెప్పారు.
ఇక ప్రైవేటీకన నిర్ణ‌యంపై ఏపీ నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వస్తోన్న విష‌యం తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతోన్న పోరాటానికి ఇప్ప‌టికే ప‌లు సంఘాలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. మహా శివరాత్రి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్ వద్ద టీసుబ్బరామిరెడ్డి శ్రీ లలితా కళా పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొన్న స్వరూపానందేంద్ర స్వామి ఈ కామెంట్స్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement