Friday, May 3, 2024

గుంటూరులో నలుగురు విద్యార్థులు మిస్సింగ్!

ఏపీలో గుంటూరు జిల్లాలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేగింది. మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. విద్యార్థులు నిన్న ఉదయం స్కూల్లో బ్యాగులు పెట్టి బయటకు వెళ్లారు. టీచర్లకు చెప్పకుండా వెళ్లారు. అనంతరం తిరిగి పాఠశాలకు బ్యాగులు తీసుకునేందుకు వచ్చారు. ఈ విషయంపై మీ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థులను ఉపాధ్యాయులను హెచ్చరించారు. దాంతో తల్లిదండ్రులకు విషయం తెలిస్తే కొడతారన్న భయంతో విద్యార్థులు అదృశ్యమయ్యారు. పారిపోయిన వారిలో ప్రభుదేవా, వెంకట్, సంతోష్, వెంకీలు ఉన్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన విద్యార్థుల కోసం తల్లిదండ్రులు, పోలీసులు వెతుకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement