Wednesday, May 15, 2024

శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి చెందారు. బొలెరో వాహనంలో ఏఆర్ కానిస్టేబుళ్లు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement