Thursday, May 2, 2024

పొట్టేళ్ల మందపై వీధి కుక్కల దాడి.. 24 పొట్టేళ్లు మృతి

పొట్టేళ్ల మందపై వీధికుక్కలు దాడి చేసిన ఘటనలో 24 పొట్టేళ్లు మృతిచెందాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మోటుపల్లి గ్రామంలో జరిగింది. మోటుపల్లి గ్రామానికి చెందిన పొట్టేళ్ల యజమాని గురవయ్య.. మధ్యాహ్న సమయంలో భోజనానికి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో దొడ్డి వద్ద కాపలా లేని పొట్టేళ్ల మందపై.. వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో 24 పొట్టేళ్లు అక్కడికక్కడే మృతి చెందాయి.

భోజనానంతరం గురవయ్య.. పొట్టేళ్ల దొడ్డి వద్దకు వెళ్లి చనిపోయిన పొట్టెళ్లను చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుక్కల దాడిలో సుమారు రూ1.5 లక్షల నష్టం వాటిల్లిందని గురవయ్య వాపోయాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement