Sunday, April 28, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

అనంతపురం జిల్లా చిలమత్తురూ మండలం కోడురు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆటోను ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయం అయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో హిందూపురం ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జు అయిపోయింది. చిలమత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement