Friday, May 10, 2024

వాళ్ల తీరేం బాగాలేదు.. గెలిచానన్న సంతోషం అస్సలు లేదు

గోవా మాజీ సీఎం, దివంగ‌త కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ కుమారుడు ఉత్ప‌ల్ పారిక‌ర్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా పోటీచేసిన ఉత్ప‌ల్‌.. బీజేపీ నేత అట‌నాసియో మాన్‌సిరెట్టి చేతిలో పరాజ‌యం పొందారు. చాలా స్వ‌ల్ప తేడాతో ఉత్ప‌ల్ ఓడిపోయారు. కానీ, తాజా గెలుపుపై ఎమ్మెల్యే మాన్‌సిరెట్టి సంతోషంగా లేన‌ని చెబుతున్నారు. ఎందుకంటే బీజేపీ మ‌ద్ద‌తుదారులు త‌న‌కు స‌రైన రీతిలో స‌హ‌క‌రించ‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మంటున్నారు. ఇంత‌కుముందే బీజేపీ లీడ‌ర్ల‌కు ఈ విష‌యాన్ని తెలియ‌జేశాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement