Tuesday, April 30, 2024

AP: కాల్వ‌లోకి దూసుకెళ్లిన 108 వాహనం….

అమృతలూరు : అమృతలూరు మండలం పెదపూడి వంతెన మలుపు వద్ద నేటి తెల్ల‌వారుఝామున 108 వాహనం నిజాంపట్నం కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో వాహనంలోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

వివ‌రాల‌లోకి వెళితే నిజాంపట్నం మండలం గోకర్ణమఠం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి, మరో ముగ్గురు సహాయకులతో 108 వాహనం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు ప్రయాణిస్తోంది. వేకువన మంచు ఎక్కువగా ఉండడంతో పెదపూడి వంతెన మలుపులో చోదకుడికి మార్గం కనిపించలేదు. దీంతో అదుపుతప్పి కాల్వలోకి వాహనం దూసుకెళ్లింది. డ్రైవర్‌ అంకమ్మరావు ఈ విషయాన్ని అమృతలూరు 108 వాహన సిబ్బందికి తెలిపారు. వెంటనే అమృతలూరుకు చెందిన 108 వాహనం ద్వారా బాధితులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్రేన్‌ సాయంతో కాలువ నుంచి వాహనాన్ని బయటకు తీశారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement