Monday, April 29, 2024

ఏపీలో కొత్త‌గా 108 క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇవాళ‌ ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 21,010 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 108 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒక కోవిడ్ బాధితుడు మృతి చెందాడు. ఇదే సమయంలో 141 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,98,406 కు చేరింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,74,976 కు పెర‌గగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,58,631 కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1878 గా ఉంటే.. మృతుల సంఖ్య 14,467 కు పెరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement