Friday, May 17, 2024

24న తిరుమలలో 1050వ అవతార మహోత్సవాలు

తిరుమల, ప్రభన్యూస్‌ : ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీతిరుమలనంబి 1050 వ అవతార మహోత్సవం ఈనెల 24న తిరుమలలోని శ్రీతిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుమలనంబి ఆలయంలో ఉదయం 9.30 గంటల నుంచి 16 మంది ప్రముఖ పండితులు తిరుమలనంబి జీవితచరిత్ర పై ఉపన్యశించనున్నారు. శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన తిరుమలనంబి శ్రీవేంకటేశ్వరస్వామివారికి తీర్ధకైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమాన, గురుతుల్యులు. వీరు రామానుజులవారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement