Sunday, May 19, 2024

టీపోపా సాయం..

హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా చిట్యాల కు చెందిన చేనేత కార్మికుడు ఎర్రమాద శివప్రసాద్  ఇటీవల మరణించాడు. తెలంగాణ పద్మశాలి అఫిషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (టీ పో పా)   హైదరాబాద్ సరూర్ నగర్ లో మృతుడి కుటుంబానికి నిత్యావసర సరుకుల తో పాటు. 30,000 ను చెక్కు రూపం లో అందించి, ఆదుకోవడం జరిగింది. డిగ్రీ చదువుతున్న స్వాతి భవిత కు టీ పో పా  భరోసా ఇచ్చింది. గండూరి వేంకటేశ్వర్లు, సామాల సహదేవ్, నామాల శ్రీనివాసులు, సిరందాస్ శ్రీనివాసులు, మాచన రఘునందన్ తదితరులు ఉన్నారు. చేనేత కార్మికులు మానసిక స్థైర్యం కోల్పోవద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సైతం చేనేత కు చేయూత ఇస్తోంది అని టీ పో పా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement